బెల్లంపల్లిలో గంజాయితో పట్టుబడ్డ యువకులు..

by Disha Web Desk 11 |
బెల్లంపల్లిలో గంజాయితో పట్టుబడ్డ యువకులు..
X

దిశ,బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో గంజాయితో ఇద్దరు యువకులు పట్టుబడ్డ సంఘటన కలకలం రేపింది. బెల్లంపల్లి వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ ఎన్ దేవయ్య కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని హనుమాన్ విగ్రహం హైవే దగ్గరలో వాహనాల తనిఖీలు చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు స్కూటీ పై అనుమానాస్పదంగా కనిపించారు. వారిని తనిఖీ చేయగా స్కూటీ డిక్కీలో 950 గ్రాముల గంజాయి లభ్యమయింది. గంజాయితో పట్టుబడిన పైడి మల్ల పృధ్వీరాజ్ పోస్టాఫీస్ బస్తీ,రామ్ శ్రీ మిత్ర టేకుల బస్తీకి చెందిన వారిగా గుర్తించారు. గత కొంత కాలంగా చంద్రపూర్ నుండి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి బెల్లంపల్లిలో యువకులకు ఎక్కువ రేటుకు విక్రయిస్తున్నారు. అంతేకాకుండా వారు కూడా గంజాయి సేవిస్తున్నట్లు పోలీస్ విచారణలో తేలింది.ఈ మేరకు పంచనామా చేసి నిందితులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ హెచ్ ఓ దేవయ్య వెల్లడించారు.

Next Story